Telangana: గురుకులంలో దారుణం.. బాలికపై మహిళా వైస్‌ ప్రిన్సిపాల్‌ లైంగిక దాడి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో దారుణ ఘటన వెలుగు చూసింది.

By -  అంజి
Published on : 5 Dec 2025 11:43 AM IST

Gurukul school, Jadcharla, Female vice principal,assaults, Crime, Telangana

Telangana: గురుకులంలో దారుణం.. బాలికపై మహిళా వైస్‌ ప్రిన్సిపాల్‌ లైంగిక దాడి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో దారుణ ఘటన వెలుగు చూసింది. విద్యార్థినిపై మహిళా వైస్‌ ప్రిన్సిపాల్‌ లైంగిక దాడికి పాల్పింది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

జడ్చర్ల మండల కేంద్రంలోని ఒక గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి లైంగిక దాడికి పాల్పడింది. దీనిపై ప్రిన్సిపాల్ కు బాధితురాలు కంప్లెంట్‌ చేసింది. అయితే ఆమె ఈ విషయాన్ని దాచిపెట్టడంతో పాటు విద్యార్థినిని భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులతో పాటు జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేసింది.

బాధిత బాలిక తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ జానకి ఈ ఘటనపై విచారణ చేపట్టి కేసు నమోదు చేయాలని జడ్చర్ల పోలీసులను ఆదేశించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై మల్లేశ్​ తెలిపారు. అటు బాలికను విచారించి వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి, ప్రిన్సిపాల్ రజిని రాగమాలను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story