ఏపీలో దారుణం.. స్వలింగ సంపర్కం వద్దన్నందుకు హత్య

ఆంధ్రప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్వలింగ సంపర్కానికి వద్దని చెప్పాడని ఓ వ్యక్తి హత్యకు పాల్పడ్డాడు.

By అంజి  Published on  30 March 2024 4:42 AM GMT
Crime news, AndhraPradesh, kavali

ఏపీలో దారుణం.. స్వలింగ సంపర్కం వద్దన్నందుకు హత్య

ఆంధ్రప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్వలింగ సంపర్కానికి వద్దని చెప్పాడని ఓ వ్యక్తి హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ వెంకటరమణ పూర్తి వివరాలు వెల్లడించారు. స్వలింగ సంపర్కం వద్దని వారిస్తున్నా, విననందుకే కావలి మండలం పెదరాముడుపాళేనికి చెందిన కాటంగారి చిన్నగోపాల్‌ హత్యకు గురైనట్లు తెలిపారు. చిన్నగోపాల్‌తో అసహజ శృంగారం చేసే బుచ్చింగారి ఎజ్రానే ఈ హత్యకు పాల్పడ్డాడని వివరించారు. చిన్న గోపాల్‌ వద్దన్నా కూడా.. నిందితుడు స్వలింగ సంపర్కానికి ఒత్తిడి చేశాడని, ఈ క్రమంలోనే విభేదాలు తలెత్తాయని తెలిపారు.

ఈ నెల 19న ఇద్దరు ఫూటుగా మద్యం సేవించారని, చిన్నగోపాల్‌ మద్యం మత్తులోకి వెళ్లగానే.. నిందితుడు అతన్ని తాళ్లతో కట్టేసి, గొంతు వద్ద నైలాన్‌ తాడుతో బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడని తెలిపారు. ఆ తరువాత మృతదేహాన్ని తగలబెట్టారు. దీనికి నిందితుడి తల్లి మంగమ్మ కూడా సహకరించింది. మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో గుంత తవ్వి పూడ్చి పెట్టి బ్లీచింగ్‌ చల్లారు. దానిపై కట్టెలు కూడా పేర్చారు. అయితే, చిన్నగోపాల్‌ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేసి.. బుచ్చింగారి ఎజ్రానే ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించి, అతడిని అరెస్ట్‌ చేశారు.

Next Story