AP: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు దుర్మరణం

నెల్లూరు జిల్లాలో ఆదివారం టీఎస్‌ఆర్‌టీసీ బస్సు ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.

By అంజి  Published on  7 Jan 2024 5:50 AM GMT
Andhra Pradesh, Two killed, bus truck collision, road accident

AP: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఆదివారం టీఎస్‌ఆర్‌టీసీ బస్సు ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. గుడ్లూరు మండలం మాచర్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ)కి చెందిన బస్సు వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. ఢీకొనడంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. బస్సు డ్రైవర్ వినోద్ (45) అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు.

క్షతగాత్రులను తొలుత కావలి ఏరియా ఆసుపత్రికి తరలించి అనంతరం నెల్లూరుకు తరలించారు. అందులో ప్రయాణిస్తున్న వారిలో సీతమ్మ (65) చికిత్స పొందుతూ మృతి చెందింది. సుమారు 30 మంది ప్రయాణికులతో టిఎస్‌ఆర్‌టిసి బస్సు తెలంగాణలోని మిర్యాలగూడ నుండి తిరుపతికి వెళుతోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.

Next Story