లారీ బీభత్సం.. 50 గొర్రెలు మృతి

Accident In Krishna District. కృష్ణా జిల్లాలో లారీ బీభ‌త్సం సృష్టించింది.50 గొర్రెలు మృతి

By Medi Samrat
Published on : 25 Feb 2021 9:50 AM IST

Accident In Krishna District

కృష్ణా జిల్లాలో లారీ బీభ‌త్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని నూజివీడు హనుమాన్ జంక్షన్ ప్రధాన రహదారిపై లారీ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంతో భారీ ప్ర‌మాదం జ‌రిగింది. గురువారం ఉద‌యం రోడ్డు మీదుగా వెళ్తున్న గొర్రెల మందపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దాదాపు 50 గొర్రెలు మృతి చెందాయి.

ఈ ఘటన మీర్జాపురం మల్లవల్లి సమీపంలో చోటు చేసుకుంది. లారీ ప్రమాదంలో మృతి చెందిన గొర్రెల క‌ళేభ‌రాలు రోడ్డు నిండా చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో గొర్రెల కాపరులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గొర్రెల ఖరీదు సుమారుగా రూ. 5 లక్షలుగా ఉంటుందని కాపర్లు వాపోతున్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కాపర్లు వేడుకుంటున్నారు. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాద జ‌రిగిన తీరుపై ఆరా తీస్తున్నారు.


Next Story