ఫేసుబుక్‌ పరిచయం.. నిజామాబాద్‌లో అదృశ్యమైన మహిళ.. యూపీలో దారుణ హత్య

A Women from Nizamabad was brutally murdered in uttar pradesh. ఫేసుబుక్‌ ద్వారా పరిచయమైన ఓ యువకుడి చేతిలో మహిళ దారుణ హత్యకు గురైంది. యువకుడికి కోసం ఏకంగా

By అంజి  Published on  13 Nov 2022 5:36 AM GMT
ఫేసుబుక్‌ పరిచయం.. నిజామాబాద్‌లో అదృశ్యమైన మహిళ.. యూపీలో దారుణ హత్య

ఫేసుబుక్‌ ద్వారా పరిచయమైన ఓ యువకుడి చేతిలో మహిళ దారుణ హత్యకు గురైంది. యువకుడికి కోసం ఏకంగా ఇల్లు వదిలి వెళ్లిన సదరు మహిళ.. అతడి చేతిలోనే హత్యకు గురైంది. మృతురాలు తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన ఉస్మాన్‌ బేగం (32)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగింది. గజరౌలా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ సెక్యూరిటీ కంపెనీ స్థలంలో 3 రోజుల క్రితం మహిళ మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు బయటపడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మొదట కంపెనీ ఉద్యోగులను పోలీసులు విచారించారు. షెహజాద్‌ అనే యువకుడి వద్ద కంపెనీ తాళం తాళం చెవి వారు తెలపడంతో.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్‌ చేయడంతో ఫేసుబుక్‌ లవ్‌ స్టోరీ మొత్తం బయటపడింది. షెహజాద్‌ను కలిసేందుకు ఈ నెల 6వ తేదీన ఇంటి నుంచి బయల్దేరిన ఉస్మాన్‌ బేగం.. అతడు చెప్పిన వివరాల ప్రకారం ఆమ్రోహ జిల్లాకు చేరుకుంది. షెహజాద్‌ను కలిసిన తర్వాత పెళ్లి చేసుకుందామని తీవ్ర ఒత్తిడి చేసింది. దీంతో షెహజాద్‌ కోపంతో ఉస్మాన్‌ను కట్టేసి, ఇటుకతో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత కంపెనీ భవనంలో ఓ మూలన మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు.

మరోవైపు బాన్సువాడలో ఈ నెల 6 నుంచి ఉస్మాన్‌ బేగం కనబడటం లేదని భర్త ముఖీద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. ఇంతలోనే ఉస్మాన్‌బేగం యూపీలో హత్యకు గురైందని బాన్సువాడ పోలీసులకు సమాచారం అందింది. ముఖీద్‌తో ఉస్మాన్‌ బేగంకు 12 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉస్మాన్‌ బేగం మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు మృతురాలి తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్ వెళ్లారు.

Next Story