బాలికపై ఎనిమిది మంది గ్యాంగ్‌ రేప్‌.. వైరల్‌గా మారిన వీడియో

A video of 8 minors being gang-raped in Rajasthan has gone viral. రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాకు చెందిన ఓ మైనర్‌ బాలికపై ఎనిమిది మంది వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

By అంజి  Published on  30 Sep 2022 8:45 AM GMT
బాలికపై ఎనిమిది మంది గ్యాంగ్‌ రేప్‌.. వైరల్‌గా మారిన వీడియో

రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాకు చెందిన ఓ మైనర్‌ బాలికపై ఎనిమిది మంది వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.50,000 వసూలు చేశారు. నిందితులు అందరూ 20 ఏళ్లలోపు వయస్సు వారే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు జిల్లాలోని కిషన్‌గఢ్ బస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 16 ఏళ్ల బాలిక ప్రైవేట్ ఫొటోలు పొందారు. రూ. 50,000 చెల్లించకపోతే ఆ ఫొటోలను బహిరంగపరుస్తామని చెప్పి ఆమెను బ్లాక్‌మెయిల్ చేశారు. ఆ తర్వాత ప్రధాన నిందితుడు సహా ఎనిమిది మంది ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనపై మైనర్‌ బాలిక సోదరుడు బుధవారం ఫిర్యాదు చేశాడు.

డిసెంబర్ 31, 2021న.. సాహిల్‌గా గుర్తించిన ప్రధాన నిందితుడు తన సోదరికి ఫోన్ చేసి, 'నీ ప్రైవేట్ ఫోటోలు తన వద్ద ఉన్నాయని', తన దగ్గరకు రాకపోతే వాటిని పబ్లిక్ చేస్తానని చెప్పాడని బాధితురాలి సోదరుడు చెప్పాడు. 8వ తరగతి చదువుతున్న ఆ బాలిక వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఎనిమిది మంది వ్యక్తులు ఆమెను బలవంతంగా బట్టలు విప్పి, లైంగికంగా వేధించి, ఆ చర్యను వీడియో తీశారు. అప్పటి నుంచి నిందితుడు బాధితురాలి నుంచి డబ్బు వసూలు చేయడం ప్రారంభించాడని, ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య నిందితులు మైనర్ నుంచి రూ.50 వేలు దోపిడీ చేశారు.

కానీ అమ్మాయి ఎక్కువ డబ్బు చెల్లించకపోవడంతో, నిందితుడు స్థానిక సోషల్ మీడియా గ్రూపుల్లో వీడియోను ప్రసారం చేశాడు. "భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 376D, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ప్రాథమికంగా ఆరోపణలు నిజమేనని తెలుస్తోంది" అని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) అతుల్ ఆగ్రా తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. తదుపరి విచారణ జరుగుతోంది.

Next Story