భార్యను చంపిన పోలీసు.. మృతదేహాన్ని ఏం చేశాడంటే?

మరో మహిళతో ఏడాది పాటు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న పోలీసు కానిస్టేబుల్ తన భార్యను కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత..

By అంజి  Published on  7 Dec 2023 1:47 PM GMT
extramarital affair, Crime news, Chhota Udepur, Gujarat

భార్యను చంపిన పోలీసు.. మృతదేహాన్ని ఏం చేశాడంటే?

గుజరాత్‌లోని ఛోటా ఉదయపూర్ జిల్లాలోని పిప్లేజ్ గ్రామంలోని అటవీ ప్రాంతంలో బుధవారం ఓ మహిళ మృతదేహం లభ్యమైంది, ఆమె భర్త, అతని ప్రియురాలి హత్యకు కారణమని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. మృతురాలు ఛోటా ఉదేపూర్‌కు చెందిన కెలిబెన్ ప్యారీగా గుర్తించారు. ఆమె భర్త వర్షన్‌భాయ్, ఒక పోలీసు కానిస్టేబుల్ మరో మహిళతో ఏడాది పాటు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, అతని వివాహంలో తరచూ గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు. కానిస్టేబుల్ తన భార్యను కత్తితో పొడిచి చంపాడని ప్రాథమిక విచారణలో తేలింది. అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలించి విచారణ చేపట్టారు.

మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ సంబంధానికి నిందితుడి భార్య అంగీకరించకపోవడమే మనస్పర్థలకు ప్రధాన కారణమని, అది ఆమె హత్యకు దారితీసిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వడోదరలోని సాయాజీ ఆస్పత్రికి తరలించారు.

పోలీసు కానిస్టేబుల్ ఇంటి ప్రాంగణంలో మహిళ అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతురాలి కుటుంబ సభ్యులు నిశ్చయించుకున్నారు. ఈ కేసులో మృతురాలి సోదరుడు వీరేసింగ్‌భాయ్ రత్వా మాట్లాడుతూ.. ''దొరికిన మృతదేహం నా సోదరిది, హత్య చేసినట్లు తెలుస్తోంది. వర్షన్‌భాయ్‌ మా బావ, మా అనుమానాలు అతని చుట్టూనే తిరుగుతున్నాయి'' అని అన్నారు.

ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. ఛోటా ఉదేపూర్ స్టేషన్‌కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ అరుణ్ పర్మార్ మాట్లాడుతూ.. 'అడవిలో మహిళ మృతదేహం లభ్యమైంది. శరీరంపై అనేక గాయాలున్నాయి.. ప్రస్తుతం ఈ హత్యలో ఇంకా ఎవరైనా అనుమానితులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. మృతురాలి భర్తను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు."

Next Story