సోదరి నగ్న ఫొటోలు తీశాడని.. వ్యక్తిని హత్య చేసిన కాలేజీ విద్యార్థి

A college student killed a man in Karnataka for clicking obscene pictures of his sister. కర్ణాటకలోని చిక్‌బాల్‌పురాలో దారుణ ఘటన చోటు చేసుంది. తన సోదరి నగ్న చిత్రాలను క్లిక్ చేసిన ఓ వ్యక్తిని కాలేజీ

By అంజి  Published on  3 Oct 2022 8:34 AM GMT
సోదరి నగ్న ఫొటోలు తీశాడని.. వ్యక్తిని హత్య చేసిన కాలేజీ విద్యార్థి

కర్ణాటకలోని చిక్‌బాల్‌పురాలో దారుణ ఘటన చోటు చేసుంది. తన సోదరి నగ్న చిత్రాలను క్లిక్ చేసిన ఓ వ్యక్తిని కాలేజీ విద్యార్థి హత్య చేశాడు. దీనికి సంబంధించి చిక్‌బల్‌పురా రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేరానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు చిక్‌బల్‌పురాకు చెందిన దర్శన్.. నందా అనే వ్యక్తి తన సోదరి అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలను క్లిక్ చేశాడని చాలా కోపంగా ఉన్నాడు. దొడ్డబల్‌పూర్‌కు చెందిన నందా ఇదే విషయమై గతంలో పలుమార్లు దర్శన్‌తో గొడవపడ్డాడు.

దర్శన్ ఇంజనీరింగ్ విద్యార్థి. నందా అతని సోదరితో స్నేహం చేశాడు. దర్శన్ సోదరిని నందా వేధించేవాడు. దర్శన్, నందల మధ్య చిన్నపాటి గొడవలు వచ్చినప్పుడల్లా ఆ వీడియోలు, ఫొటోలు బయటపెడతానని నంద బెదిరించేవాడు. దీంతో దర్శన్ తన స్నేహితుడు ఆశ్రయ్‌తో కలిసి నందను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే నందాను దర్శన్‌ దారుణంగా హత్య చేశాడు. మృతదేహం హ్రోబండే సమీపంలో కనుగొనబడింది. పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

హత్య కేసులో దర్శన్‌తో పాటు అతని స్నేహితుడు ఆశ్రయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు తదుపరి విచారణ జరుగుతోంది.

Next Story