సోదరిని హత్య చేసిన సోదరుడు.. కాపాడే ప్రయత్నంలో తల్లి మృతి

ఓ వ్యక్తి వేరే వర్గానికి చెందిన వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే ఆరోపణతో తన 19 ఏళ్ల సోదరిని హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది.

By అంజి  Published on  31 Jan 2024 1:52 AM GMT
Karnataka,  interfaith relationship, Man kills sister, Crime news

సోదరిని హత్య చేసిన సోదరుడు.. కాపాడే ప్రయత్నంలో తల్లి మృతి 

కర్నాటకలోని మైసూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి వేరే వర్గానికి చెందిన వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే ఆరోపణతో తన 19 ఏళ్ల సోదరిని హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. కూతురిని కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా చనిపోయింది. నివేదికల ప్రకారం, మృతురాలు ధను శ్రీగా గుర్తించబడింది. బురఖా ధరించి కనిపించింది. ఒక ముస్లిం అబ్బాయితో కనిపించింది. ఆమె సోదరుడు తన సోదరి చర్యలను వ్యతిరేకించాడు. మరొక కమ్యూనిటీకి చెందిన వారితో సంబంధం పెట్టుకోవద్దని కోరాడు.

సోదరుడు హెచ్చరికలు చేసినప్పటికీ, ధనుశ్రీ ముస్లిం అబ్బాయితో తన సంబంధాన్ని కొనసాగించింది. ఇది సోదరుడు నితిన్‌కు కోపం తెప్పించింది. దీంతో మైసూర్‌లోని హున్‌సూర్‌కు సమీపంలో ఉన్న మరూర్ సమీపంలోని సరస్సులోకి తన సోదరిని నెట్టడానికి దారితీసిందని పోలీసులు తెలిపారు. ధనుశ్రీని రక్షించే ప్రయత్నంలో 43 ఏళ్ల వారి తల్లి అనిత కూడా నీటిలో దూకి చనిపోయిందని పోలీసులు తెలిపారు. రెండు మరణాలకు సంబంధించి పోలీసులు నితిన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Next Story