నైనిటాల్‌లో లోయలో పడ్డ వాహనం.. 8 మంది మృతి

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో సోమవారం రాత్రి వాహనం లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు

By అంజి  Published on  9 April 2024 3:47 AM GMT
Uttarakhand, Nainital, accident

నైనిటాల్‌లో లోయలో పడ్డ వాహనం.. 8 మంది మృతి

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో సోమవారం రాత్రి వాహనం లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నైనిటాల్‌లోని బేతాల్‌ఘాట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

మృతులను విశ్రమ్ చౌదరి (50), ధీరజ్ (45), అనంతరామ్ చౌదరి (40), వినోద్ చౌదరి (38), ఉదయరామ్ చౌదరి (55), తిలక్ చౌదరి (45) గోపాల్ బస్నియాత్ (60), రాజేంద్ర కుమార్‌లుగా గుర్తించారు. క్షతగాత్రులను శాంతి చౌదరి, ఛోటూ చౌదరి, ప్రేమ్ బహదూర్‌లుగా గుర్తించారు.

రాత్రి 10.30 గంటల ప్రాంతంలో బాస్కోట్ గ్రామానికి చెందిన డ్రైవర్ రాజేంద్ర కుమార్ (38) వాహనంపై నియంత్రణ కోల్పోయి 200 మీటర్ల లోయలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు.

Next Story