ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడ్డ బస్సు.. ఐదుగురు మృతి, 38 మందికి గాయాలు

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలోని బారాబతి సమీపంలో జాతీయ రహదారి-16పై 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఫ్లైఓవర్‌పై నుంచి జారిపడటంతో ఐదుగురు మరణించారు.

By అంజి  Published on  16 April 2024 12:48 AM GMT
bus falls from flyover, Odisha, Jajpur, Crime

ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడ్డ బస్సు.. ఐదుగురు మృతి, 38 మందికి గాయాలు

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలోని బారాబతి సమీపంలో జాతీయ రహదారి-16పై 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఫ్లైఓవర్‌పై నుంచి జారిపడటంతో సోమవారం ఐదుగురు మరణించారు. 38 మంది గాయపడ్డారు. బస్సు కటక్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారి సంఖ్యను జాజ్‌పూర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ధృవీకరించారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. క్షతగాత్రులను కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ అండ్ ఆసుపత్రికి, జాజ్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పంపినట్లు ఆయన తెలిపారు.

డ్రైవర్ మద్యం మత్తులో ఉండొచ్చని ప్రమాదాన్ని గమనించిన స్థానికుడు తెలిపారు. "మేము సమీపంలోని బస్టాండ్ వద్ద ఉన్నాము, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా, యాదృచ్ఛికంగా బస్సును నడుపుతున్నట్లు మేము కనుగొన్నాము. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని మేము భావిస్తున్నాం" అని స్థానికులు చెప్పారు. ప్రమాద స్థలంలో అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 3 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Next Story