దొంగతనం అనుమానం.. నలుగురిని తలకిందులుగా వేలాడదీసి.. ఆపై..

మహారాష్ట్రలోని ఓ గ్రామంలో మేక, కొన్ని పావురాలను దొంగిలించారనే అనుమానంతో నలుగురు వ్యక్తులను చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసి, కర్రలతో కొట్టారు.

By అంజి  Published on  28 Aug 2023 1:30 AM GMT
Maharashtra, Crime news, beaten, theft suspicion

దొంగతనం అనుమానం.. నలుగురిని తలకిందులుగా వేలాడదీసి.. ఆపై..

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని హరేగావ్ గ్రామంలో మేక, కొన్ని పావురాలను దొంగిలించారనే అనుమానంతో నలుగురు దళిత వ్యక్తులను చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసి, కర్రలతో కొట్టినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని, ఈ దాడికి సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్టు చేయగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితులను యువరాజ్ గలాండే, మనోజ్ బోడాకే, పప్పు పర్ఖే, దీపక్ గైక్వాడ్, దుర్గేష్ వైద్య, రాజు బోరాగ్‌లుగా గుర్తించారు. నిందితుల్లో ఒకరు దాడికి సంబంధించిన వీడియోను చిత్రీకరించారు.

ఆ వీడియో సోషల్ మీడియాలో కనిపించిందని పోలీసులు తెలిపారు. సమాచారం ప్రకారం.. 20 ఏళ్ల వయస్సు గల బాధితులను ఆరుగురు వ్యక్తుల బృందం వారి ఇళ్ల నుండి ఆగష్టు 25 న కిడ్నాప్ చేశారు. దాడి తరువాత, గాయపడిన వారిని వెంటనే వైద్య సహాయం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఒకరైన శుభం మగాడే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ప్రకారం, అధికారులు భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 307 (హత్య ప్రయత్నం) మరియు 364 (కిడ్నాప్), షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని ఇతర సంబంధిత నిబంధనలతో పాటుగా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story