బిడ్డను రూ.30 వేలకు అమ్మేందుకు.. తల్లి ప్రయత్నం.. ట్విస్ట్‌ ఇచ్చిన పోలీసులు

30-year-old woman tries to sell her baby. నార్త్ ఢిల్లీలోని సబ్జీ మండిలో 30 ఏళ్ల మహిళ తన ఒక నెల బిడ్డను రూ. 30,000కి విక్రయించడానికి ప్రయత్నించినందుకు అరెస్టు చేయబడింది.

By అంజి  Published on  25 Jan 2022 7:42 AM GMT
బిడ్డను రూ.30 వేలకు అమ్మేందుకు.. తల్లి ప్రయత్నం.. ట్విస్ట్‌ ఇచ్చిన పోలీసులు

నార్త్ ఢిల్లీలోని సబ్జీ మండిలో 30 ఏళ్ల మహిళ తన ఒక నెల బిడ్డను రూ. 30,000కి విక్రయించడానికి ప్రయత్నించినందుకు అరెస్టు చేయబడింది. శిశువును 'అమ్మడానికి' దంపతులను వెతకడానికి ప్రయత్నిస్తున్న ముఠాతో మహిళ టచ్‌లో ఉందని, వారితొ రూ. 2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారితో పాటు తల్లిని తీహార్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రకారం.. ఒక ముఠా శిశువును విక్రయించడానికి ప్రయత్నిస్తోందని, "బాగా డబ్బులు చెల్లించగల" జంటల కోసం వెతుకుతున్నట్లు సమాచారం వచ్చింది.

దీంతో ఇద్దరు పోలీసు సిబ్బంది జంటగా నటిస్తూ నిందితులను శనివారం సంప్రదించారు. "మేము ఒక మహిళ, ఆమె ఇద్దరు సహచరులను కలవడానికి కానిస్టేబుల్ రాకేష్, కానిస్టేబుల్ అంజులను పంపాము. 50,000 రూపాయలకు బిడ్డను ఇస్తానని నిందితులు హామీ ఇచ్చారు" అని ఓ అధికారి తెలిపారు. సబ్ ఇన్‌స్పెక్టర్ లలిత్ కుమార్ నేతృత్వంలోని బృందం ఒప్పందాన్ని అంగీకరించి మంగోల్‌పురికి వెళ్లింది. నిందితుల్లో ఒకరు తన బిడ్డతో రావాలని మహిళను పిలిచాడు. డీల్ కుదుర్చుకుని కానిస్టేబుళ్లు రూ.50వేలు ఇచ్చారని పోలీసులు తెలిపారు. డీసీపీ (నార్త్) సాగర్ సింగ్ కల్సి మాట్లాడుతూ.."మేము శిశువు కోసం ఇచ్చిన నగదును, వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నాము." అని తెలిపారు.

Next Story