వ్యాన్‌ను ఢీ కొట్టిన బైక్‌.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం

ఒడిశాలోని కటక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ముగ్గురు 10వ తరగతి విద్యార్థులు తమ వాహనం పిక్-అప్ వ్యాన్‌ను ఢీకొనడంతో మృతి చెందారు.

By అంజి  Published on  15 Oct 2023 12:59 AM GMT
Odisha, Bike accident, Crime news

వ్యాన్‌ను ఢీ కొట్టిన బైక్‌.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం

ఒడిశాలోని కటక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ముగ్గురు 10వ తరగతి విద్యార్థులు తమ వాహనం పిక్-అప్ వ్యాన్‌ను ఢీకొనడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కోచింగ్ క్లాస్‌కు హాజరైన విద్యార్థులు ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాణా శంఖ ప్రాంతంలో శనివారం నాడు ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన విద్యార్థులను బంకిలోని హరిరాజ్‌పూర్ గ్రామానికి చెందిన సోహమ్ నాయక్, అమ్యాన్సు పిరోయ్, అబినాష్ నాయక్‌లుగా గుర్తించారు.

మోటర్‌ సైకిల్‌ ఢీకొనడం చాలా తీవ్రంగా ఉందని, రైడర్లు తమ మోటార్‌సైకిల్‌పై నుండి విసిరివేయబడి కొంత దూరంలో నేలపై పడిపోయారని ఆయన చెప్పారు. ముగ్గురు విద్యార్థులను బంకి ఆసుపత్రిలో చేర్చగా, వారిలో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మూడవ విద్యార్థిని కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తరలించగా, అతను గాయాలతో మరణించాడని అధికారి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. పోలీసులు వ్యాన్‌ను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు.

Next Story