ఐదేళ్ల చిన్నారిపై ముగ్గురు మైనర్లు అత్యాచారం.. టెర్రస్‌పై ఆడుకుంటుండగా..

ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఐదేళ్ల బాలికపై ఆమె ఇంట్లో అద్దెకుంటున్న ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శనివారం తెలిపారు.

By అంజి  Published on  20 Oct 2024 1:15 AM GMT
minor boys, Uttar Pradesh, Crimenews, Ballia district

ఐదేళ్ల చిన్నారిపై ముగ్గురు మైనర్లు అత్యాచారం.. టెర్రస్‌పై ఆడుకుంటుండగా..

ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఐదేళ్ల బాలికపై ఆమె ఇంట్లో అద్దెకుంటున్న ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. ఆరు, 13, 16 ఏళ్ల వయసున్న ముగ్గురు నిందితులు తమ ఇంటి టెర్రస్‌పై ఆడుకుంటున్న చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం (అక్టోబర్ 16) సాయంత్రం చోటుచేసుకుంది. ముగ్గురు అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నారు.

బాలిక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎస్పీ వీర్ నేరస్థలాన్ని సందర్శించి ఫోరెన్సిక్ బృందంతో కలిసి పరిశీలించినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) యోగేంద్ర బహదూర్ సింగ్ వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు .

ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సింగ్ తెలిపారు. గత నెలలో ఇదే తరహా ఘటనలో నగరంలోని సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్జన ప్రదేశంలో ఏడేళ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు, ఒకరు 8 ఏళ్లు, ఒకరు 7 ఏళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు .

Next Story