అడవిలో యువతి మృతదేహం.. మెడపై..?
20-Year-Old Woman Found Dead In UP Forest. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువతి అడవిలో విగతజీవై కనిపించింది.
By M.S.R
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువతి అడవిలో విగతజీవై కనిపించింది. ఫతేపూర్ జిల్లాలోని ఒక అడవిలో మహిళ శవమై కనిపించింది. జఫర్గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ జయచంద్ర భారతి మాట్లాడుతూ, గ్రామస్తుల సమాచారం మేరకు 20 ఏళ్ల యువతి మృతదేహం అడవిలో కనిపించింది. యువతి మెడపై గాయం గుర్తులు ఉండడంతో హత్య చేసి అడవిలో పడేసి ఉండొచ్చని అనుమానిస్తూ ఉన్నారు. బాధితురాలి గుర్తింపు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
బల్లియాలో ఇటీవలే పవన్ అనే బాలుడి హత్య జరిగింది. హనుమాన్గంజ్ గ్రామం నుండి బాలుడిని కిడ్నాప్ చేశారు. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టగా.. బుధవారం నాడు ఓ గొయ్యిలో పవన్ మృతదేహం లభ్యమైందని సుఖ్పురా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ పరాస్ నాథ్ సింగ్ తెలిపారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, మృతిపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి
కడప జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి
కడప జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. సి.కె.దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాయచోటి నుంచి కడపకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో చిన్నారి, ముగ్గురు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. లారీ ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం.

Join us in our Fight Against Mis-Information
© 2024 All rights reserved