దారుణం.. క‌దులుతున్న బ‌స్‌లో బాలిక‌పై సామూహిక అత్యాచారం

17 Year Old Girl Molested on moving bus in Bihar.మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. నిత్యం ఏదో ఒక చోట వారిపై దాడుల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jun 2022 5:06 AM GMT
దారుణం.. క‌దులుతున్న బ‌స్‌లో బాలిక‌పై సామూహిక అత్యాచారం

మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. నిత్యం ఏదో ఒక చోట వారిపై దాడుల‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. తాజాగా బీహార్ రాష్ట్రంలో నిర్భ‌య త‌ర‌హా ఘ‌ట‌న జరిగింది. క‌దులుతున్న బ‌స్సులో ఓ మైన‌ర్ బాలిక‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బ‌స్ డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌, హెల్ప‌ర్ తో పాటు మ‌రొక‌రిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరి బస్టాండ్‌లో బెట్టయ్య ప్రాంతానికి వెళ్లేందుకు 17 ఏళ్ల బాలిక బస్సు కోసం ఎదురుచూస్తోంది. ఆ స‌మ‌యంలో అటుగా ఓ బ‌స్సు వ‌చ్చింది. బ‌స్సు డ్రైవ‌ర్.. బాలిక‌ను ఎక్క‌డికి వెళ్లాల‌ని అడుగ‌గా.. బెట్ట‌య్య‌కు వెళ్లాల‌ని బాలిక చెప్పింది. తాము కూడా అటే వెలుతున్న‌ట్లు బ‌స్సు డ్రైవ‌ర్ చెప్ప‌డంతో.. అత‌డి మాట‌లు న‌మ్మిన బాలిక బ‌స్సు ఎక్కింది.

బాలిక బ‌స్సు ఎక్కిన అనంత‌రం మ‌త్తుమందు క‌లిపిన పానియాన్ని ఇచ్చారు. అది తాగిన త‌రువాత బాలిక స్పృహ కోల్పోయింది. అనంత‌రం న‌లుగురు ఆ బాలిక‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఆ త‌రువాత‌ బాలికను బ‌స్సులోనే వ‌దిలివేసి డోర్లు వేసి అక్క‌డి నుంచి నిందితులు ప‌రారు అయ్యారు.

తనకు మెలకువ వచ్చిన తర్వాత చూస్తే డోర్లు వేసి ఉన్నాయని, అటుగా వెళ్తున్న వారు గుర్తించి తలుపులు తెరవడంతో తాను బయటపడ్డానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలిక పేర్కొంది. బాలిక‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు చికిత్స అందించారు. బ‌స్సును సీజ్ చేశామ‌ని, ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. కేసు న‌మోదు చేసి న‌లుగురిని అదుపులోకి తీసుకున్న‌ట్లు చెప్పారు.

Next Story