మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం

జన్నారం మండలం తొమ్మిడిగుడిసెలపల్లి గ్రామం వద్ద రోడ్డు పక్కన ఉన్న చెట్టును కారు ఢీకొనడంతో పదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి

By Medi Samrat  Published on  13 July 2024 9:15 AM GMT
మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం

జన్నారం మండలం తొమ్మిడిగుడిసెలపల్లి గ్రామం వద్ద రోడ్డు పక్కన ఉన్న చెట్టును కారు ఢీకొనడంతో పదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆదిలాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలం కొత్తపల్లికి చెందిన గోపీచంద్‌ జాదవ్‌ కుమారుడు జైసన్‌ రాజ్‌ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కారు చెట్టును ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు జన్నారం సబ్‌ఇన్‌స్పెక్టర్‌ గుండేటి రాజ్యవర్ధన్‌ తెలిపారు.

ఈ ప్రమాదంలో నార్నూర్ ఇన్‌స్పెక్టర్ గన్‌మెన్ గోపీచంద్, అతని భార్య గీత, తల్లి జీజాబాయి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. మందమర్రిలో జరిగిన జన్మదిన కార్యక్రమంలో పాల్గొని కొత్తపల్లికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గోపీచంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విచారణ జరుగుతోంది.

Next Story