భారత్‌లో 23లక్షలు దాటిన పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Aug 2020 5:32 AM GMT
భారత్‌లో 23లక్షలు దాటిన పాజిటివ్‌ కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 60,943 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 834 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,29,638కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 16,39,599 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 6,43,948 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 46,091 మంది మరణించారు.

నిన్న ఒక్కరోజులో 7,33,449 శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 2,60,15,297 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఇక దేశంలో రికవరీ రేటు 70శాతానికి చేరింది. మరణాల రేటు 1.99శాతంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో ఐదో స్థానంలో ఉంది. ఇక భారత్‌లో అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాజ్‌ రాష్ట్రాల్లో నమోదు అవుతున్నాయి.

Next Story