ఏపీలో కొత్తగా 8,368 పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Sep 2020 11:54 AM GMT
ఏపీలో కొత్తగా 8,368 పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా నిత్యం పదివేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24గంటల్లో 58,187 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 8,368 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,06,493కి చేరింది.

కొవిడ్‌ వల్ల ప్రకాశంలో పది మంది, గుంటూరులో తొమ్మిది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, కడపలో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఏడుగురు, కృష్ణలో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, అనంతపూర్‌లో నలుగురు, కర్నూల్‌లో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, తూర్పుగోదావరిలో ముగ్గరు చొప్పున మొత్తం 70 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 4,487 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 4,04,074 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 97,932 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 584,

చిత్తూరులో 875,

ఈస్ట్‌ గోదావరిలో 1312,

గుంటూరులో 765,

కడపలో 447,

కృష్ణలో 193,

కర్నూలులో 316,

నెల్లూరులో 949,

ప్రకాశంలో 419,

శ్రీకాకుంలో 559,

విశాఖపట్నంలో 405,

విజయనగరంలో 594,

పశ్చిమ గోదావరి 950 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story