ఏపీలో 2లక్షలు దాటిన కరోనా కేసులు
By తోట వంశీ కుమార్ Published on 7 Aug 2020 7:32 PM ISTఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విలతాండవం కొనసాగుతోంది. రాష్ట్రంలో కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలు దాటింది. గడిచిన 24గంటల్లో 62,938 శాంపిల్స్ను పరీక్షించగా.. 10,171 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,960కి చేరింది.
కొవిడ్ వల్ల చిత్తూరులో పది మంది, అనంతపూర్లో తొమ్మిది మంది, గుంటూరులో తొమ్మిది మంది, నెల్లూరులో తొమ్మిది మంది, పశ్చిమ గోదావరిలో తొమ్మిది మంది, తూర్పుగోదావరిలో ఏడుగురు, కడపలో ఏడుగురు, ప్రకాశంలో ఏడుగురు, కృష్ణలో ఆరుగురు, కర్నూల్లో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు చొప్పున 89 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1842కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 1,20,464 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 84,654 మంది చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 1100,
చిత్తూరులో 980,
ఈస్ట్ గోదావరిలో 1270,
గుంటూరులో 817,
కడపలో 596,
కృష్ణలో 420,
కర్నూలులో 1331,
నెల్లూరులో 941,
ప్రకాశంలో 337,
శ్రీకాకుంలో 449,
విశాఖపట్నంలో 852,
విజయనగరంలో 530,
పశ్చిమ గోదావరిలో 548 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.