ఒకే అపార్టుమెంట్‌కు చెందిన 44 మందికి క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 May 2020 12:20 PM GMT
ఒకే అపార్టుమెంట్‌కు చెందిన 44 మందికి క‌రోనా

దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృభిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని నిరోధించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికి రోజు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒకే భ‌వ‌నంలో 44 మందికి క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ కావ‌డంతో అంతా ఉలిక్కి ప‌డుతున్నారు.

ఢిల్లీలోని కాపస్ హీరాలో ఏప్రిల్ 19న ఓ వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ వ్య‌క్తిని వెంట‌నే ఆస్ప‌త్రికి పంపి.. ఆ వ్య‌క్తి నివ‌సించే భ‌వ‌నంలోని పాలు అమ్మే వ్య‌క్తి, కూర‌గాయ‌లు అమ్మే వ్య‌క్తితో పాటు ఆ భ‌వ‌నంలో నివ‌సిస్తున్న వారందిరితో పాటు ఆ ఏరియాలో మ‌రికొంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మొత్తం 350 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 70 మంది రిపోర్టులు వచ్చాయి. ఆ 70 మందిలో 44 మందికి క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. వారంతా ఓకే అపార్టుమెంట్‌కు చెందిన వారు. ఇంకా మిగిలిన వారి రిపోర్టులు రావాల్సి ఉంది. వారంద‌రిని క్వారంటైన్‌కు త‌ర‌లించారు అధికారులు. మిగిలిన రిపోర్ట‌లు కోసం ఎదురుచూస్తున్నారు.

Next Story