దారుణం: కిడ్నాప్‌కు గురైన చిన్నారి హత్య..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Nov 2019 11:52 AM GMT
దారుణం: కిడ్నాప్‌కు గురైన చిన్నారి హత్య..!

కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విజయవాడ నగర శివారులోని నల్లగుంట్ల గ్రామంలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి హత్యకు గురైంది. పక్కింట్లోనే చిన్నారి ద్వారక (8)ను హత్య చేశారు. ఆదివారం సాయంత్రం ఇంటి దగ్గర ఆడుకుంటూ చిన్నారి కనిపించకుండా పోయింది. దీంతో వెంటనే చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మేకల ప్రకాష్‌ అనే దుండగుడు పాపను చంపేసి ఇంట్లోని మూటలో ఉంచాడు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story