విజయవాడ: ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆకస్మికంగా బదిలీ చేయడాన్ని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు తప్పుబట్టారు. ఆల్ఇండియా సర్వీసెస్లో పనిచేసేవారిని సాధారణ ఉద్యోగిగా బదిలీ చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని చంద్రబాబు విమర్శించారు. అన్నా.. అన్నా.. అంటూనే బదిలీ చేశారన్నారు. సీఎస్ను క్లర్క్ కంటే హీనంగా బదిలీ చేస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాన్ని నడిపించే మార్గం ఇదేనా? అని చంద్రబాబు నిలదీశారు.