కత్తి కార్తీకపై చీటింగ్‌ కేసు నమోదు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Oct 2020 1:26 PM GMT
కత్తి కార్తీకపై చీటింగ్‌ కేసు నమోదు

బిగ్‌బాస్-1 కంటెస్టెంట్‌, యాంక‌ర్‌ కత్తి కార్తికపై కేసు నమోదయ్యింది. ఒక ల్యాండ్ ఇష్యూ సెటిల్ చేస్తానంటూ కోటి రూపాయల మోసానికి పాల్పడినట్లు కార్తీక, ఆమె అనుచరులపై బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేర‌కు బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదయ్యింది. కత్తి కార్తిక ప్ర‌స్తుతం దుబ్బాక నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

అమీన్‌పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇప్పించేందుకు కార్తిక మధ్యవర్తిత్వం చేశారని బాధితుడి ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి దగ్గర కార్తిక, అనుచరులు కోటి రూపాయల నగదును సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నారని బాధితుడు చెబుతున్నాడు. కార్తీక నుంచి తన డబ్బులు ఇప్పించాలని బాధితుడు కోరుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విష‌య‌మై కార్తీక ఇంకా స్పందించలేదు.

Next Story