కోఠిలో వ్యాపారి కిడ్నాప్‌

By సుభాష్
Published on : 3 Jan 2020 9:40 AM IST

కోఠిలో వ్యాపారి కిడ్నాప్‌

హైదరాబాద్‌లోని కోఠిలో ఓ వ్యాపారి కిడ్నాప్‌కు గురయ్యాడు. సుల్తాన్‌ బజార్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని కోఠి చౌరస్తాలో ఐదుగురు దుండగులు కారులో వచ్చి రాజీరెడ్డి అనే వ్యాపారిని కిడ్నాప్‌ చేశారు. ఈ మేరకు రాజీరెడ్డి మిత్రుడు సురేందర్‌ డయాల్‌ 100 ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సుల్తాన్‌ బజార్‌లో గల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాంట్రాక్ట్‌ డబ్బుల విషయంలో ఈ దుండగులు కిడ్నాప్‌ చేసినట్లు సుల్తాన్‌ బజార్‌ సీఐ సుబ్బిరామారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కాగా, కిడ్నాప్‌ చేయడానికి గల కారణాలు, కిడ్నాపర్లను త్వరలో పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Next Story