రైల్వే ప్ర‌యాణీకుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. నేటి నుంచి మార్చి 1 వరకు పలు రైళ్లు రద్దు

South Central Railway cancelled some trains from Today.రైల్వే ప్ర‌యాణీకుల‌కు అల‌ర్ట్‌. కాచిగూడ‌, గుంటూరు, తిరుప‌తికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Feb 2023 5:11 AM GMT
రైల్వే ప్ర‌యాణీకుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. నేటి నుంచి మార్చి 1 వరకు పలు రైళ్లు రద్దు

రైల్వే ప్ర‌యాణీకుల‌కు అల‌ర్ట్‌. కాచిగూడ‌, గుంటూరు, తిరుప‌తికి మ‌ధ్య రాక‌పోక‌లు సాగించే ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేశారు. మ‌ర‌మ్మ‌తు ప‌నుల కార‌ణంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నాన్-ఇంటర్‌లింకింగ్ పనుల వల్ల నిర్ణ‌యించిన రోజుల్లో ఆరు రైళ్ల‌ను పూర్తిగా, నాలుగు రైళ్ల‌ను పాకిక్షంగా ర‌ద్దు చేశారు.

వివ‌రాలు ఇవే..

* గుంటూరు - కాచిగూడ(17251) ట్రైన్‌ను ఈ నెల 12 నుంచి 28 వరకు, కాచిగూడ-గుంటూరు(17252) రైలును 13 నుంచి వచ్చే నెల మార్చి 1వ‌ర‌కు ర‌ద్దు చేశారు.

* మచిలీపట్నం-కర్నూలు సిటీ(ట్రైన్ నెంబర్ 07067) రైలును ఈ నెల 14, 16,18, 21,23,25,28వ తేదీలలో రద్దు చేయగా, కర్నూలు సిటీ-మచిలీపట్నం(07068) ట్రైన్‌ను ఈ నెల 15,17,19,22,24,26తో పాటు మార్చి 1 వరకు రద్దు చేశారు.

* కాచికూడ-మెదక్(07577) ట్రైన్ 13 నుంచి మార్చి 1వరకు, మెదక్-కాచిగూడ(07578) ట్రైన్ 13 నుంచి మార్చి 1వ తేదీ వరకు రద్దు చేశారు.

* గుంటూరు-డోన్(17228) రైలును ఈ నెల 12 నుంచి 28వరకు, డోన్-గుంటూరు(17227) రైలును 13 నుంచి మార్చి 1 వరకు రద్దు చేశారు.

* గుంటూరు-సికింద్రాబాద్(17253) ట్రైన్‌ను 19 నుంచి 28 వరకు గుంటూరు-దొనకోండ మధ్య, సికింద్రాబాద్-గుంటూరు(17254) రైలును 18వ తేదీ నుంచి 27 వరకు దొనకోండ-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు.

* గుంటూరు-తిరుపతి(17261) ట్రైన్‌ను 19 నుంచి 28 వరకు గుంటూరు-మార్కాపురం మధ్య పాక్షికంగా రద్దు చేశారు. అలాగే తిరుపతి-గుంటూరు(17262) మధ్య రోజూ సర్వీసులు అందించే ట్రైన్‌ను ఈ నెల 18 నుంచి 27వ తేదీ వరకు మార్కాపురం-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు.

* రేపల్లె-మార్కాపురం(07889) ట్రైన్‌ను 12 నుంచి 28 వరకు గుంటూరు-మార్కాపురం మధ్య పాక్షికంగా రద్దు చేశారు. మార్కాపురం-తెనాలి(07890) రైలును 12 నుంచి 28 వరకు మార్కాపురం-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ విష‌యాన్ని ప్ర‌యాణీకులు గ‌మ‌నించాల‌ని కోరారు.

Next Story