రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. వాహనదారులు వాహనాలను భయటకు తీయాలంటేనే జంకుతున్నారు. ఇంధన ధరలు పెరగడం వల్ల నిత్యావసరాల ధరలు పెరుగుతుండడంతో సగటు జీవి బతుకు బండి లాగడం చాలా కష్టంగా మారింది. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం పెట్రోల్ ధరలు 25 పైసలు పెరగగా.. డీజిల్ 33 పైసలు పెరిగింది. ఈ పెంపు తర్వాత ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.101.89కు డీజిల్ ధర రూ.90.47కి చేరుకుంది.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.102.14, డీజిల్ ధర రూ.90.47
- ముంబైలో పెట్రోల్ ధర రూ.108.19కు, డీజిల్ ధర రూ.98.16
- జైపూర్లో పెట్రోల్ ధర రూ.108.98, డీజిల్ రూ.99.63