హెూటళ్లు, రెస్టారెంట్లు తదితర అవసరాల కోసం ఉపయోగించే కమర్షియల్ గ్యా స్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.33.50 తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నా యి. తగ్గించిన ధరతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ రూ.1631.50గా ఉండనుంది. ఇక గృహ అవసరాల కోసం ఉపయోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. చిన్న వ్యాపారాలకు ఈ తగ్గింపు కొంతమేర ఉ పశమ ఓనం కలిగించనుంది. రాష్ట్రాల వారీగా తగ్గింపులో మార్పు ఉంటుంది.