AI వాడకపోతే నో ప్రమోషన్..యాక్సెంచర్ షాకింగ్ రూల్!
ప్రముఖ అంతర్జాతీయ ఐటీ కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్, తన ఉద్యోగులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది.
By - Knakam Karthik |
AI వాడకపోతే నో ప్రమోషన్..యాక్సెంచర్ షాకింగ్ రూల్!
ప్రముఖ అంతర్జాతీయ ఐటీ కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్, తన ఉద్యోగులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇకపై కంపెనీలో పదోన్నతులు పొందాలంటే కేవలం పనితీరు మాత్రమే సరిపోదు, కృత్రిమ మేధస్సు (AI)ని ఎంతగా వాడుతున్నారనేది అత్యంత కీలకం కానుంది.
సీనియర్ మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్లు నాయకత్వ పాత్రల్లోకి ఎదగాలంటే AI సాధనాలను "క్రమం తప్పకుండా వాడటం" ఇప్పుడు తప్పనిసరి. ఉద్యోగులు వాస్తవానికి AIని ఉపయోగిస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి కంపెనీ 'AI రిఫైనరీ' వంటి ప్లాట్ఫామ్లలో వారీవారీగా లాగిన్ డేటాను ట్రాక్ చేస్తోంది. ఒకవేళ AI టెక్నాలజీకి అలవాటు పడలేకపోతే, అలాంటి వారు కంపెనీ నుండి బయటకు వెళ్లక తప్పదని (Exit) సీఈఓ జూలీ స్వీట్ ఇదివరకే హెచ్చరించారు.
AI నైపుణ్యాలు నేర్చుకోలేని సుమారు 11,000 మంది ఉద్యోగులను యాక్సెంచర్ గతంలోనే తొలగించింది. ఇందుకోసం దాదాపు $865 మిలియన్లను సెవరెన్స్ ప్యాకేజీల కోసం కేటాయించింది. తన 7.8 లక్షల మంది ఉద్యోగుల్లో ఇప్పటికే 5.5 లక్షల మందికి పైగా సిబ్బందికి జనరేటివ్ AIలో శిక్షణ ఇచ్చింది. NVIDIA భాగస్వామ్యంతో AI రంగాన్ని మరింత బలోపేతం చేస్తోంది. "నైపుణ్యం మార్చుకోండి లేదా బయటకు వెళ్లండి". AI వాడకాన్ని పెంచి ఉత్పాదకతను రెట్టింపు చేయడమే లక్ష్యంగా యాక్సెంచర్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.