బ్రేకింగ్: బస్సు దగ్ధం.. మంటల్లో 50 మంది ప్రయాణికులు

By సుభాష్  Published on  10 Jan 2020 6:39 PM GMT
బ్రేకింగ్: బస్సు దగ్ధం.. మంటల్లో 50 మంది ప్రయాణికులు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కన్నౌజ్ లో ఒక ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు బస్సు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. బస్సు కన్నౌజ్ నుంచి జైపూర్ కు వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది.

Next Story