ఆ నాలుగు రోజులు బ్యాంక్లు బంద్..!
By అంజి Published on 22 March 2020 11:41 AM GMTహైదరాబాద్: బ్యాంక్ కస్టమర్లు అలర్ట్ అవ్వండి. వచ్చే వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే బ్యాంక్లు పనిచేయనున్నాయి. ఈ నెల 25న ఉగాది పండుగ కావడంతో బ్యాంక్లకు సెలవు ఉంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్పూర్తో పాటు పలు ప్రాంతాల్లో బ్యాంక్లు పని చేయవు. మార్చి 27 శుక్రవారం ఒక్క రోజు సమ్మె చేయనున్నట్లు బ్యాంక్ యూనియన్లు ప్రకటించాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) అనే రెండు బ్యాంక్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి.
తరువాత రెండు రోజులు(28 శనివారం, 29 ఆదివారం) కూడా బ్యాంకులు పని చేయవు. అంటే మొత్తంగా వారంలో నాలుగు రోజలు బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. బ్యాంకుల విలినాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెకు వెళ్తామని ఈ రెండు బ్యాంక్ యూనియన్లు హెచ్చరించాయి. వచ్చే వారంలో బ్యాంక్లో ఎవరికైనా పని ఉంటే వెంటనే జాగ్రత్త పడండి.
Also Read: 31 వరకు రైళ్లు, అంతరాష్ట్ర బస్సులు బంద్
ఏప్రిల్ 1 నుంచి బ్యాంకుల విలీనం అమలులోకి వస్తుందని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), యునైటెడ్ బ్యాంకులు కలిసిపోనున్నాయి. పీఎన్బీ ఈ బ్యాంకుల కార్యకలాపాలు చూసుకుంటుంది. తొలిగా విలీనం అయ్యే బ్యాంకులు ఇవే. అలాగే ఇండియన్ బ్యాంక్ను అలహబాద్ బ్యాంక్తో విలీనం చేయనున్నారు. దీంతో 7వ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఆవిర్భవిస్తుంది.