ఏపీని భయపెడుతున్న కరోనా..24 గంటల్లో 80 కొత్త పాజిటివ్ కేసులు
By సుభాష్ Published on 23 April 2020 2:32 PM ISTఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గురువారం ఏపీ ఆరోగ్యశాఖ కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 893 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 141 మందిని డిశ్చార్జ్ అయ్యారు. ఇక 27 మంది మృతి చెందారు. కాగా, నిన్న ఉదయం 9గంటల నుంచి గురువారం 9 గంటల వరకు 6522 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. ప్రస్తుతం 725 మంది చికిత్స పొందుతున్నారు.
Also Read
ఏపీలో 97 రెడ్ జోన్ మండలాలుఇక కర్నూలు జిల్లాలో 31, గుంటూరు 18, చిత్తూరు 14, అనంతపురం 6, తూర్పుగోదావరి 6, కృష్ణ 2, ప్రకాశం 2,విశాఖ జిల్లా నుంచి ఒకటి చొప్పున కొత్తగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికగా కర్నూలు జిల్లాలో 234 కేసులు, గుంటూరు జిల్లాలో 195 కేసులు నమోదయ్యాయి.
Next Story