ఏపీలో 15వేలకు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 July 2020 7:49 AM GMT
ఏపీలో 15వేలకు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో శరవేగంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 28,239 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 657 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 611 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 39 మంది.. 7గురు విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15252కి చేరింది.

ఈ రోజు కొవిడ్‌ వల్ల కృష్ణలో ముగ్గురు, కర్నూల్‌లో ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 193కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 6988 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 8071మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదు అయిన కేసుల్లో అనంతపురంలో 118, చిత్తూరులో 35, ఈస్ట్‌ గోదావరిలో 80, గుంటూరులో 77, కడపలో 60, కృష్ణలో 52, కర్నూలులో 90, నెల్లూరులో 33, ప్రకాశంలో 28, విశాఖపట్నంలో 21, విజయనగరంలో 2, పశ్చిమ గోదావరిలో 15 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story