ఏపీలో 10వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు.. కొత్తగా 497 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2020 8:20 AM GMT
ఏపీలో 10వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు.. కొత్తగా 497 కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజు రోజుకి రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 36,047 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 497 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 448 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 37 మంది.. 12మంది విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10331కి చేరింది.

ఈ రోజు కొవిడ్‌ వల్ల కృష్ణలో ముగ్గురు, కర్నూల్‌లో నలుగురు, గుంటూరులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒక్కరు మొత్తం 10మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 129కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 4779 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 5423 మంది చికిత్స పొందుతున్నారు. ఈరోజు అనంతపురంలో 90, చిత్తూరులో 40, ఈస్ట్‌ గోదావరిలో 54, గుంటూరులో 39, కడపలో 24, కృష్ణలో 36, కర్నూలులో 76, నెల్లూరులో 9, ప్రకాశంలో 8, విశాఖపట్నంలో 41, విజయనగరంలో 3, పశ్చిమ గోదావరిలో 28 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Untitled 6 Copy

Next Story