ఏపీలో మరో 135 కరోనా కేసులు
By తోట వంశీ కుమార్Published on : 11 Jun 2020 12:38 PM IST

ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 11,602 సాంపిల్స్ ను పరీక్షించగా.. కొత్తగా మరో 135 పాజిటివ్ కేసులు నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4261 కి చేరింది. కొవిడ్ వల్ల తూర్పుగోదావరిలో ఒకరు, కృష్ణాలో ఒకరు మరణించారు.
దీంతో ఈ మహమ్మారి వల్ల ఇప్పటి వరకు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 2,540మంది డిశ్చార్జి కాగా.. 1641మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Next Story