ఏపీలో కొత్తగా మరో 130 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Jun 2020 8:34 AM GMT
ఏపీలో కొత్తగా మరో 130 కేసులు

ఏపీలో క‌రోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 17,695 సాంపిల్స్ ను ప‌రీక్షించ‌గా.. కొత్త‌గా మ‌రో 130 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3718 కి చేరింది. కొవిడ్‌ వల్ల కృష్ణలో ఒకరు, కర్నూలులో ఒకరు మరణించారు. దీంతో ఈ మ‌హ‌మ్మారి వల్ల ఇప్పటి వరకు 75 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం న‌మోదు అయిన కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 2,353మంది డిశ్చార్జి కాగా.. 1290మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 131 మందికి కరోనా సోకింది. ఇత‌ర‌ రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 810 మంది కరోనా బారినప‌డినట్లు ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

Untitled 10 Copy

Next Story