ఏపీలో కొత్త‌గా మ‌రో 68 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2020 6:09 AM GMT
ఏపీలో కొత్త‌గా మ‌రో 68 కేసులు

ఏపీలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నా.. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాగాజా గడిచిన 24 గంటల్లో 9,664 మంది సాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా.. కొత్తగా 68 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 2787 కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ 1913 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకూ 58మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 816 మంది కోవిడ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొత్త‌గా న‌మోదైన 68 కేసుల్లో కోయంబేడు కాంటాక్టు కేసులు నెల్లూరులో 8, చిత్తూర్‌లో 1 కేసు చొప్పున న‌మోదు అయ్యాయి.

AP corona cases rise to 2787

Next Story