రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. త్వరలో రైతు భరోసా నిధులు

రైతులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ నెల 28వ తేదీన వైఎస్‌ఆర్‌ రైతు భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు.

By అంజి  Published on  25 Feb 2024 1:09 AM GMT
YSR Rythu bharosa, APnews, CMJagan

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. త్వరలో రైతు భరోసా నిధులు

రైతులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ నెల 28వ తేదీన వైఎస్‌ఆర్‌ రైతు భరోసా మూడో విడత కింద 53.58 లక్షల మంది ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ.1,078 కోట్లను సీఎం జగన్‌ జమ చేయనున్నారు. 2023–24 సీజన్‌ మూడో విడత కింద పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 28న తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్‌ నొక్కి ఈ సొమ్ము జమ చేస్తారు. కాగా రైతు భరోసా కింద ఐదేళ్లలో రూ.34,288 కోట్లు సాయం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే.. రైతు భరోసా నిధులు 2023–24లో తొలి విడతలో 52,57,263 రైతు కుటుంబాలకు రూ.3,942.95 కోట్లు, రెండో విడతలో 53,52,905 కుటుంబాలకు రూ.2,204.77 కోట్లు సాయం అందించారు. కాగా మూడో విడతలో 53,58,368 రైతు కుటుంబాలకు రూ.1,078.36 కోట్లు జమ చేయనున్నారు. అలాగే రబీ 2021 - 22, ఖరీఫ్‌ - 2022 సీజన్‌లో సున్నా వడ్డీ రాయితీకి అర్హత పొందిన 10.79 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.215 కోట్లు జమ చేస్తారు. తాజాగా జమ చేసే మొత్తంతో కలిపి ఈ ఐదేళ్లలో 84.67 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.2,050.53 కోట్లు జమ చేశారు.

Next Story