అమరావతి వేశ్యల రాజధాని కామెంట్స్‌పై మహిళలకు జగన్, భారతి రెడ్డి వెంట‌నే క్షమాపణ చెప్పాలి

అమరావతి మన రాజధాని.. అమరావతి రాజధానిగా ఉండటం మనకు గర్వ కారణం అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు.

By Medi Samrat
Published on : 9 Jun 2025 7:42 PM IST

అమరావతి వేశ్యల రాజధాని కామెంట్స్‌పై మహిళలకు జగన్, భారతి రెడ్డి వెంట‌నే క్షమాపణ చెప్పాలి

అమరావతి మన రాజధాని.. అమరావతి రాజధానిగా ఉండటం మనకు గర్వ కారణం అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత 10 ఏళ్లుగా ఇప్పటి వరకు రాజధాని లేదు.. ఇలాంటి సమయంలో అమరావతి మన రాజధాని అని నిర్మించుకునే సమయం.. ఇలాంటి సమయంలో రాజధాని గురించి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ అంశం కూడా క్షమించరానిది అన్నారు. వేశ్యల రాజధాని అనే వాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. ఇలాంటి మాటలు క్షమించరానివి.. ఇలా మాట్లాడటం దురదృష్టకరం.. ఇది చిన్న విషయం కాదు.. ఇలాంటి పొరపాటు జరిగినందుకు ఎవరైనా క్షమాపణ చెప్పాలన్నారు. పార్టీ అయినా.. మీడియా హౌజ్ అయినా క్షమాపణలు చెప్పాలన్నారు.

వైసీపీ పార్టీకి చెందిన సాక్షి చానల్‌లో ప్రసారం చేసినందుకు సాక్షి హౌజ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి మీడియా హౌజ్ నడుపున్న భారతి రెడ్డి క్షమాపణ చెప్పాలి.. భారతి రెడ్డి క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు.. నామోషీ చెందాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. సాక్షి ఛాన‌ల్ YCP మీడియా.. జగన్ కూడా క్షమాపణ చెప్పాలన్నారు. మహిళల మనోభావాలు దెబ్బతీశారు. మహిళల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పడంలో ఎందుకు జగన్ వెనకడుగు వేస్తున్నారని ప్ర‌శ్నించారు.

ఇలాంటి నీచపు కామెంట్స్ వ‌ల్ల‌ రాజధాని అమరావతి మీద ఎలాంటి ఎఫెక్ట్ పడద‌న్నారు. ఇలాంటి వాఖ్య‌ల్లో వాస్తవం లేదన్నారు. అక్కడ వేశ్యలు కాదు.. అందరూ ఉంటారు.. అన్ని వర్గాల వారు ఉంటారు. ఇవి బేస్ లెస్ అండ్ సెన్స్ లెస్ కామెంట్స్ అన్నారు.

Next Story