వైఎస్ఆర్ వర్ధంతి వేళ జగన్‌పై షర్మిల కౌంటర్లు

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat
Published on : 1 Sept 2025 7:13 PM IST

వైఎస్ఆర్ వర్ధంతి వేళ జగన్‌పై షర్మిల కౌంటర్లు

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘"అన్నమయ్య..ఇక అంతేనయ్య" అంటూ పోస్టు పెట్టారు. ప్రాజెక్ట్ కొట్టుకు పోయి ఐదేళ్లు దాటినా పునర్ నిర్మాణానికి దిక్కులేదు. 39 మందిని బలిగొన్న ఘోర విపత్తులో జరిగిన నష్టాన్ని పూడ్చే మనసు ప్రభుత్వాలకు లేదని ఆరోపించారు. 5 ఊళ్లు కొట్టుకుపోతే పునరావాసానికి రూపాయి ఇచ్చింది లేదు. సర్వం కోల్పోయిన నిరాశ్రయులను నేటికీ ఆదుకున్నది లేదన్నారు. గత వైసీపీ, నేడు కూటమి ప్రభుత్వాలు కలిసి అన్నమయ్య ప్రాజెక్ట్‌ను అనాథ ప్రాజెక్ట్ కింద మార్చారని విమర్శించారు.

""అన్నమయ్య..ఇక అంతేనయ్య". ప్రాజెక్ట్ కొట్టుకు పోయి 5ఏళ్లు దాటినా పునర్ నిర్మాణానికి దిక్కులేదు. 39 మందిని బలిగొన్న ఘోర విపత్తులో జరిగిన నష్టాన్ని పూడ్చే మనసు ప్రభుత్వాలకు లేదు. 5 ఊళ్లు కొట్టుకుపోతే పునరావాసానికి రూపాయి ఇచ్చింది లేదు. సర్వం కోల్పోయిన నిరాశ్రయులను నేటికి ఆదుకున్నది లేదు. గత YCP @YSRCParty , నేడు కూటమి ప్రభుత్వాలు కలిసి అన్నమయ్య ప్రాజెక్ట్ ను "అనాథ ప్రాజెక్ట్" కింద మార్చారు.గత ముఖ్యమంత్రి జగన్ @ysjagan గారు 800 కోట్లతో మరమత్తులు అంటూ హడావిడి తప్పా ప్రాజెక్ట్ ను కట్టింది లేదు. పునరుద్ధరణ పేరుతో 3 ఏళ్లు గడిపారే తప్పా... తట్టెడు మట్టి వేయలేదు. బాధిత కుటుంబాలకు ఇండ్లు అందలేదు. చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు దక్కలేదు. ఇసుక మాఫియాతో ప్రాజెక్టుకు గండి పడితే అసెంబ్లీ వేదికగా హై లెవెల్ కమిటీలనీ, దర్యాప్తు కొనసాగిస్తామని కాలయాపన తప్పా జగన్ గారు ఉద్ధరించింది శూన్యం. అధికారంలో వచ్చిన ఏడాదిలో ప్రాజెక్ట్ కడతామని చెప్పి చంద్రబాబు @ncbn గారు చేస్తుంది మోసమే. రాజంపేటకు రెండు సార్లు వచ్చి పోయినా ప్రాజెక్ట్ పనులకు మోక్షం లేదు. 340 కోట్లతో మరమత్తులు అని చెప్పి రూపాయి కూడా ఇవ్వలేదు. డ్యామ్ నిర్మాణం కోసం సర్వేల పేరుతో బాబు గారు సైతం కాలయాపన చేస్తున్నారు. రాజంపేట వేదికగా మళ్లీ మాయమాటలు చెప్పారు తప్పిస్తే ప్రాజెక్ట్ నిర్మాణంపై దిశా - నిర్దేశం లేకపోవడం శోచనీయం. కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి @JaiTDP @JanaSenaParty @BJP4Andhra ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అన్నమయ్య కన్నీటి వ్యధకు శాశ్వత పరిష్కారం చూపాలి. గత 5 ఏళ్లుగా నీటి నిల్వ లేక 30 వేల ఎకరాలకు సాగునీరు పారడం లేదు. లక్షమందికి త్రాగునీరు అందడం లేదు. వెంటనే పూర్తి స్థాయి నిధులు కేటాయించి అన్నమయ్య ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని, డ్యామ్ ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు హామీల మేరకు పూర్తి స్థాయి జరగాలని డిమాండ్ చేస్తున్నాం." అంటూ ట్వీట్ చేశారు.

Next Story