కోలుకున్న వాచ్ మన్ రంగన్న

Watchman Ranganna, an eyewitness in the YS Viveka murder case, has recovered. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగన్న కోలుకున్నారు

By Medi Samrat  Published on  7 May 2023 11:19 AM GMT
కోలుకున్న వాచ్ మన్ రంగన్న

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగన్న కోలుకున్నారు. పులివెందులకు చేరుకున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు. కోలుకున్న ఆయన తాజాగా తన ఇంటికి చేరుకున్నారు. రంగన్న కొద్ది రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నెల 2న ఆస్తమాతో ఇబ్బంది పడుతున్న రంగన్నను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్ కు, తర్వాత హైదరాబాద్‌ కు తీసుకెళ్లారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. వివేకా హత్య కేసులో రంగన్న రెండేళ్ల క్రితమే మేజిస్ట్రేట్ ముందు కీలక వాంగ్మూలం ఇచ్చారు. ఎర్రగంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి కలిసి వివేకాను హత్య చేశారని రంగన్న చెప్పారు. ప్రత్యక్ష సాక్షి కావడం వల్ల ఆయనకు పటిష్ట భద్రత కల్పిస్తున్నారు.


Next Story