రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు.
By Medi Samrat
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నానని ఎక్స్ ద్వారా తెలిపారు. తాను ఏ రాజకీయపార్టీ లోను చేరడం లేదు.. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడం లేదని.. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం.. ఎలాంటి ఒత్తిళ్లు లేవు.. ఎవరూ ప్రభావితం చెయ్యలేదని వివరణ ఇచ్చారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నానని పేర్కొన్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్కు, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకి సదా కృతజ్ఞుడిని అని ఎక్స్ పోస్టులో వెల్లడించారు.
జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా.. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానని వెల్లడించారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
టీడీపీతో రాజకీయంగా విభేదించా.. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు.. పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందని వెల్లడించారు. నా భవిష్యత్తు వ్యవసాయం.. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానని ముగించారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 24, 2025
రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను.
ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు.
ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.…