అమరావతి: రాష్ట్రంలో డ్రైవర్లకు ఆర్థికసాయంపై ఏపీ సర్కార్ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం అందించేందుకు మొత్తం 3,10,385 మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. ఈ పథకం అమలుతో రూ.466 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆటో, క్యాబ్ యజమానే డ్రైవర్గా ఉండాలని, ఇతర గూడ్స్ వాహనాలకు ఈ స్కీం వర్తించదని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. సీఎం చంద్రబాబు అక్టోబర్ 2న అకౌంట్లలోకి డబ్బులు జమ చేయనున్నారు.