ద్రోణి ప్రభావంతో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

By -  Knakam Karthik
Published on : 5 Nov 2025 5:33 PM IST

Weather News, Andrapradesh, Amaravati, Rain Alert, AP State Disaster Management Authority

ద్రోణి ప్రభావంతో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

అమరావతి: నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు గురువారం (06-11-2025) కృష్ణా, ప్రకాశం,నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప,అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రకాశం(జి) బి.చెర్లపల్లిలో 65.2మిమీ, శ్రీసత్యసాయి(జి) గండ్లపెంటలో 45మిమీ, నెల్లూరు(జి) రాపూర్ 40.5మిమీ, విజయవాడ తూర్పులో 39మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

Next Story