మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం, అమరావతిలో 10 సంస్థలకు భూ కేటాయింపులు

ఆంధ్రప్రదేశ్ రాజ‌ధాని అమరావ‌తిలో వివిధ సంస్థ‌ల‌కు భూ కేటాయింపుల కోసం ఏర్పాటైన మంత్రి వ‌ర్గ ఉప సంఘం భేటీ అయ్యింది.

By Knakam Karthik
Published on : 23 Jun 2025 4:17 PM IST

Andrapradesh, Amaravati, ministerial sub-committee, land allocation

మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం, అమరావతిలో 10 సంస్థలకు భూ కేటాయింపులు

ఆంధ్రప్రదేశ్ రాజ‌ధాని అమరావ‌తిలో వివిధ సంస్థ‌ల‌కు భూ కేటాయింపుల కోసం ఏర్పాటైన మంత్రి వ‌ర్గ ఉప సంఘం భేటీ అయ్యింది. 16 అంశాల‌ను అజెండాలో చేర్చ‌గా..అందులో 12 అజెండాల‌కు అమోదం తెలిపింది. ఇవాళ స‌మావేశంలో 10 సంస్థ‌ల‌కు కొత్త‌గా భూ కేటాయింపుల‌కు అమోదం తెల‌ప‌గా, మ‌రో రెండు సంస్థ‌ల‌కు గ‌డువు పొడిగించారు. ప్ర‌స్తుతం అమ‌రావ‌తిలో టెండ‌ర్లు ద‌క్కించుకున్న అన్ని సంస్థ‌లు ప‌నులు ప్రారంభించాయ‌ని..ప్ర‌స్తుతం 10 వేల మంది కార్మికులు ప‌ని చేస్తున్న‌ట్లు మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ ప్ర‌క‌టించారు.

అమ‌రావ‌తిలో వివిధ సంస్థ‌ల‌కు భూ కేటాయింపుల కోసం ఏర్పాటైన మంత్రి వ‌ర్గ ఉప సంఘం సమావేశం అయ్యింది. మంత్రి నారాయ‌ణ‌తో పాటు భ‌రత్ హాజ‌రుకాగా.. జూమ్ ద్వారా మంత్రులు ప‌య్యావుల కేశ‌వ్, కందుల దుర్గేష్ హ‌జ‌ర‌య్యారు. 2014- 19 కాలంలో రాజధాని లో భూములు కేటాయించిన సంస్థల్లో నాలుగు సంస్థలకి కొనసాగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. సెంటర్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్‌కు రెండు ఎకరాలు కేటాయింపు. జుయాలజీకల్ ఆఫ్ సర్వే సంస్థకు రెండు ఎకరాలు,స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు ఐదు ఎకరాలు,ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు మూడు ఎకరాలు.. ఈ నాలుగు సంస్థలకు గతంలో కేటాయించిన భూ కేటాయింపులను మ‌రోసారి కొన‌సాగించాని అమోదం తెలిపింది. 2014-19లో భూములు కేటాయించిన గెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంబికా అగర్‌బత్తి కి అనుమ‌తుల‌ రద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు రెండు ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంక్‌కు రెండు ఎకరాలు,సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.4 ఎకరాలు, ఇంటిలిజెన్స్ బ్యూరో (SIB)కి 0.5 ఎకరాలు, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్‌కి 0.5 ఎకరాలు చొప్పున కొత్తగా ఆరు సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ స‌బ్ క‌మిటి నిర్ణ‌యం తీసుకుంది.

Next Story