డ్రైవ‌ర్‌కు గుండెపోటు.. అదుపుతప్పి కాల్వ‌లోకి దూసుకెళ్లిన‌ బస్సు

బాపట్ల డిఫో కు చెందిన ఆర్ టి సి బస్సు రేపల్లె నుంచి చీరాల వెళుతున్న క్రమంలో కర్లపాలెం ముకుంద టీ స్టాల్ దాటిన తరువాత బస్సు డ్రైవర్ కు గుండెపోటు రావడంతో.. బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాలలోకి దూసుకెళ్లింది.

By Kalasani Durgapraveen  Published on  16 Oct 2024 6:04 AM GMT
డ్రైవ‌ర్‌కు గుండెపోటు.. అదుపుతప్పి కాల్వ‌లోకి దూసుకెళ్లిన‌ బస్సు

బాపట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రేపల్లె నుంచి చీరాల వెళుతున్న క్రమంలో ప్ర‌మాదానికి గురైంది. కర్లపాలెం ముకుంద టీ స్టాల్ దాటిన తరువాత బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాలలోకి దూసుకెళ్లింది. గుండెపోటుకు గురైన‌ డ్రైవర్ సాంబశివరావు చనిపోయారు. బస్సును పొలాల్లోకి వెళ్తున్న సమయంలో ముందుగా వెళ్లే సైకిల్ ను డీ కొట్టింది. సైకిల్ పై వెళుతున్న పిట్టు వెంకటేశ్వరరెడ్డి అనే వ్య‌క్తి కాలికి తీవ్ర గాయమైంది. బస్సులో సుమారు సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు కండక్టర్ వినుకొండలరావు తెలిపారు. ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నార‌ని వెల్ల‌డించారు.

Next Story