ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల పర్యటనలకు తరచూ ఉపయోగించే హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు వస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ హెలికాప్టర్ను వినియోగించవచ్చా లేదా అనే అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్కు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలకు వెళ్తున్నప్పుడు జీఎంఆర్ సంస్థకు చెందిన హెలికాప్టర్ను వాడుతుంటారు. అయితే, ఈ హెలికాప్టర్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
తాజాగా ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. అమరావతి నుంచి ఆ హెలికాప్టర్లోనే తిరుపతి వెళ్లారు. అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టుకు ఇదే హెలికాప్టర్లో వెళ్లేలా షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే, ఆయన తిరుపతిలో హెలికాప్టర్ ఎక్కిన తర్వాత సాంకేతిక లోపం బయటపడింది. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం పర్యటనను కేంద్ర మంత్రి రద్దు చేసుకున్నారు. తరచూ ఈ హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో హెలికాప్టర్ వినియోగించవచ్చా? లేదా? స్పష్టంగా పేర్కొంటూ ఒక నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్ు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు.