ఏపీ ప్రజలకు సూపర్‌ సిక్స్‌ హామీలిచ్చిన నారా లోకేష్‌

‘సూపర్‌ సిక్స్‌’ హామీలతో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త విజన్‌ని తీసుకొస్తామని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

By అంజి  Published on  11 Feb 2024 1:15 PM GMT
TDP, Lokesh, AndhraPradesh, Six guarantees, Janasena

ఏపీ ప్రజలకు సూపర్‌ సిక్స్‌ హామీలిచ్చిన నారా లోకేష్‌

‘సూపర్‌ సిక్స్‌’ హామీలతో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త విజన్‌ని తీసుకొస్తామని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ‘శంఖారావం’ పేరుతో లోకేష్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. 'బాబు హామీ-భవిష్యత్తుకు హామీ'లోని 'సూపర్ సిక్స్' హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, పాఠశాలకు వెళ్లే ప్రతి చిన్నారికి సంవత్సరానికి రూ. 15,000, 20 లక్షల ఉద్యోగ అవకాశాలు లేదా నిరుద్యోగ భృతి నెలకు రూ. 3,000, 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ. 1,500, ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తరాంధ్రను గంజాయి దందాకు కేంద్రంగా మార్చారని లోకేష్‌ విమర్శించారు. దాదాపు ఐదేళ్ల పాలనలో కనీసం ఒక్కసారైనా జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేయకుండా జగన్ యువతను మోసం చేశారని అన్నారు. రాష్ట్రంలో దళితులు, బీసీ వర్గాలపై జరుగుతున్న అఘాయిత్యాలపై జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ కార్యకర్తలను తప్పుడు కేసుల్లో ఇరికించిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ప్రభుత్వ అధికారులు, నాయకుల పేర్లతో కూడిన ‘రెడ్ బుక్’ను కూడా లోకేష్‌ ప్రదర్శించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును 53 రోజుల పాటు జగన్ ప్రభుత్వం అక్రమంగా జైలులో పెట్టిందన్నారు. రెడ్‌ బుక్‌ని చూసి అధికార వైఎస్సార్‌సీపీకి చెందిన వారందరూ ఇప్పుడు భయపడుతున్నారని లోకేష్‌ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి టీడీపీ కార్యకర్తలపై అనేక కేసులు పెట్టారని, టీడీపీ నేతలను ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బందులకు గురిచేసిన అధికారులు, వైఎస్సార్‌సీపీ నేతల పేర్లను రెడ్‌బుక్‌లో నిక్షిప్తం చేశానని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రను గంజాయి కేంద్రంగా మార్చారని లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖులకు జన్మనిచ్చిన చరిత్ర ఈ భూమికి ఉందని లోకేశ్ గుర్తు చేశారు

'(సిద్ధం) పేరుతో ఆయన బహిరంగ సభలపై జగన్‌ను దూషించిన టీడీపీ నాయకుడు, మీరు దేనికి సిద్ధమవుతున్నారని ప్రశ్నించారు. బహుశా జగన్ జైలుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారేమోనని, ఆయన్ను జైలుకు పంపేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రజలను లోకేష్‌ అడిగారు. బీసీ నాయకుడు అమర్‌నాథ్ గౌడ్, దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్, అనేక మంది మైనార్టీలు, అతని సొంత మామ హత్యలకు జగన్‌ కారణమని ఆరోపించారు. లోకేశ్ మాట్లాడుతూ.."స్థానిక భూ ఆక్రమణలలో తమకు సహకరించడం లేదని మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్‌ఓ) రామయ్యను వైఎస్సార్‌సీపీ నాయకులు హత్య చేశారని ఆరోపించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ ‘అకృత్యాలను’ తీవ్రంగా వ్యతిరేకించడం వల్లే జూనియర్ ఇంజనీర్ రామకృష్ణ హత్యకు గురయ్యారని ఆయన పేర్కొన్నారు.

నిరుద్యోగ యువతకు డీఎస్సీ ద్వారా 23 వేల పోస్టులు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదని జగన్‌ను ప్రశ్నించగా.. యువతలో ‘యువ గళం’కు వస్తున్న విపరీతమైన స్పందనను చూసి అధికార పార్టీ నేతలకు మతి భ్రమించిందని లోకేష్ అన్నారు. టీడీపీ హయాంలో 1.7 లక్షల పోస్టులు భర్తీ చేశామని గుర్తు చేసిన లోకేష్.. వచ్చే టీడీపీ-జనసేన ప్రభుత్వంలో ఏటా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

రూ.లక్ష చెప్పులు వేసుకుని, రూ.వెయ్యి వాటర్ బాటిల్ తాగే జగన్ పేదల కష్టాలను ఎలా అర్థం చేసుకోగలడు.. సొంత చెల్లెలికే భద్రత లేనప్పుడు ఈ ప్రభుత్వంలో ఇతరులకు రక్షణ ఎలా ఉంటుందో అని లోకేష్ ప్రశ్నించారు. వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నీలి బటన్‌ నొక్కి రూ.10 ఇస్తున్నారని, అయితే రెడ్‌ బటన్‌ ద్వారా వారి నుంచి రూ.100 వెనక్కి తీసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story