అమరావతి: అనాథలు, నిరాశ్రయులు, సీనియర్ సిటిజన్లకోసం అమలు చేసే “అమృత ఆరోగ్య పథకం” విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదనంగా 1,113 మంది అనాథలు, నిరాశ్రయులు, వృద్ధులకు అమృత ఆరోగ్య పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2812 మందికి అమృత ఆరోగ్య పథకం వర్తింపజేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం..గుర్తించిన వారందరికీ ఎన్టీఆర్ వైద్య సేవట్రస్టు ద్వారా ఉచితంగా వైద్య చికిత్సలు అందించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
అమృత ఆరోగ్య పథకం కింద 1044 థెరపీలు /సర్జరీలు సహా ఏడాదికి 2.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తోంది. కాగా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సీఈవోకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సారభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు.